Prabhas: బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్ పోస్ట్ హీరోలు ఈ బ్యానర్లో పని చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి ఈ బ్యానర్ కి అధినేత గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్(Karan Johar) బాహుబలి సినిమాని కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేయడం జరిగింది. కాగా తాజాగా కరణ్ జోహార్ … హీరో ప్రభాస్(Prabhas) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళితే ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీసులో బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా చాలా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు మీడియా సమావేశాలు చాలా సందర్భాలలో పెట్టడం జరిగింది. కానీ మిగతా హీరోలకు ప్రభాస్ కి ఉన్న తేడా గమనిస్తే… ప్రభాస్ మీడియా సమావేశం అంటే దాదాపు 500 మంది మీడియా ప్రతినిధులు వచ్చేస్తారు.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లేకపోతే వేరే ఇండస్ట్రీకి చెందిన హీరోల సమావేశాలకు ఇటువంటి రెస్పాన్స్ నేను చూడలేదు అని కరణ్ జోహార్ సంచలన కామెంట్ చేశారు. బాహుబలి సినిమా తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయిన సంగతి తెలిసిందే. బాహుబలి(Bahubali) సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రభాస్ మార్కెట్ తెలుగులో మాత్రమే కాక యావత్ భారతదేశంలో అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దీంతో ప్రభాస్ సినిమా అంటే చాలు నిర్మించడానికి దర్శకత్వం చేయడానికి.. పక్కన నటించడానికి నటీనటులు దర్శకులు నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.
ఇటువంటి తరుణంలో బాలీవుడ్ బడా నిర్మాతగా పేరున్న కరణ్ జోహార్ ఈ కామెంట్ చేయటం అటు బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాదే శ్యామ్(Radhey Shyam), సాలార్(Salaar),.. మరికొన్ని కీలక ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అని కూడా పాన్ ఇండియా నేపథ్యం కలిగిన సినిమాలు. అయితే వీటన్నింటిలో ” సినిమా ముందుగా రిలీజ్ కానుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!