Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నాలుగు సినిమాలు కమిటయ్యాడు. కానీ, ఈ సినిమాలలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో షూటింగ్ పూర్తి కాలేదు. కరోనా దెబ్బ కొట్టకుండా పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాల షూటింగ్ సజావుగా సాగి ఉంటే ఈ పాటికే రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవి. కానీ, అలా జరగకపోవడంతో నిర్మాతలకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారట. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ఇంకా కొన్ని సన్నివేశాలు పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం ఇదే నెలలో 25వ తేదీ నుంచి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.
అవతల సరిగ్గా ఒక్క నెల మాత్రమే రిలీజ్కు సమయం ఉంది. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే డేట్ ప్రకటించారు. కానీ, పవన్ కళ్యాణ్ ఒకసారి కరోనా బారిన పడ్డారు. అందుకే థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా అది తగ్గేవరకు షూటింగ్కు రానని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ పాల్గొనే సన్నివేశాలు పూర్తైతేనే భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. లేదంటే మరోసారి పోస్ట్ పోన్ తప్పదు అంటున్నారు. ఇక ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైన పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు కూడా బడ్జెట్ కారణంగానే నిలిచిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారట.
పవన్ కళ్యాణ్ పక్కాగా గనక డేట్స్ సర్దుబాటు చేస్తే నిర్మాత ఫైనాన్షియర్స్ వద్ద డబ్బు సర్దుబాటు చేసుకోవాలని చూస్తున్నారట. కానీ, పవన్ మాత్రం కరోనాను దృష్ఠిలో పెట్టుకొని ఏ విషయం క్లారిటీగా చెప్పడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీశ్ శంకర్ తెరకెక్కించాల్సిన భవదీయుడు భగత్సింగ్ సినిమా ఇంకా షూటింగే మొదలవలేదు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో..ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. నిర్మాతలు మాత్రం పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారట. మరి పవర్ స్టార్ ఎప్పుడు సెట్స్లో అడుగుపెడతానని మేకర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!