ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క ఇంకా కొంత మంది హీరోయిన్లు డిమాండ్ తగ్గిపోయింది. ఇదే తరుణంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన జోరు చూపిస్తుంది. వరుస అవకాశాలతో స్టార్ హీరోల పక్కన నటిస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరోల పక్కన నటించి ఇటీవల అనేక విజయాలు తన ఖాతాలో వేసుకుంది.
దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ ఒక్క సారిగా రెండు కోట్లకు పెంచేసి, దానికంటే తక్కువ ఇచ్చిన చేసేది లేదని డిమాండ్ చేస్తున్నట్లు టాక్. దరిదాపుల్లో టాప్ హీరోయిన్లు ఎవరూ లేకపోవడంతో, మార్కెట్ మొత్తం తన చేతిలో ఉండటంతో సౌత్ నుండి నార్త్ వరకు పూజాహెగ్డే ఓ వెలుగు వెలుగుతోంది. ఇండస్ట్రీలో పూజా హెగ్డే కి పోటీ ఇచ్చే హీరోయిన్లు ప్రస్తుతం ఎవరు లేరు.
రష్మిక మందన సినిమాలు చేస్తున్న ఆమె ఇంకా స్టార్ స్టేటస్ లోకి రాలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ రాధాకృష్ణ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఇద్దరు హీరోల సినిమాల్లో ఛాన్సులు రాగా…. సినిమాకి ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసిందట. టాప్ హీరోలు అయినా గాని రెమ్యూనరేషన్ లో తగ్గే ప్రసక్తి లేదని మొహం మీదే చెప్పేసిందట. దీంతో ఈ వార్త తెలుసుకున్న ఆ ఇద్దరి టాప్ హీరోల ఫ్యాన్స్ పూజా హెగ్డే పై రగిలిపోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరో పక్క దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇప్పుడు ఇదే ఫార్ములా పూజా హెగ్డే బాగా ఆచరిస్తుంది అంటూ సినిమా విశ్లేషకులు అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?