Puri Jagannadh: డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్కి, బ్యాంకాక్కి విడతీయలేని సంబంధం ఉంది. ఎందుకంటే, ఏదైనా సినిమాను తెరకెక్కించేందుకు ముందు, ఆ తర్వాత పూరి వాలిపోయేది బ్యాంకాక్లోనే. దీంతో ఆయన బ్యాంకాక్ బీచ్ లో కూర్చుని స్క్రిప్ట్ వర్క్ చేస్తుంటాడని చాలా మంది అంటుంటారు. కానీ, ఈ విషయంపై ఎప్పుడూ స్పందించని పూరి జగన్నాథ్.. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో సీక్రెట్ రివిల్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాలయ్య టాక్ షోలోని తాజా ఎపిసోడ్లో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి గెస్ట్లుగా విచ్చేశారు. అయితే ఈ షోలో బాలయ్య `బ్యాంకాక్ బ్యాంకాక్ అంటూ ఉంటారు… అసలు బ్యాంకాక్ బీచ్ లో కూర్చుని స్క్రిప్ట్ లను అంత సులభంగా ఎలా రాస్తావు..? అంటూ ప్రశ్నించారు.
అందుకు స్పందించిన పూరి జగన్నాథ్.. `అసలు బ్యాంకాక్ బీచ్లో స్క్రిప్ట్ రాయడం చాలా కష్టం. అంత ఎంటర్టైన్మెంట్ ముందు స్క్రిప్ట్ అస్సలు రాయలేం. అలాంటి వాతావరణంలో నిబద్దతతో కూర్చుని స్క్రిప్ట్ వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే నేను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బీచ్ లో ఉండి ఫుల్ రిలాక్స్ అయిపోతాను. సాయంత్రంకు రూముకు వెళ్లి అప్పుడు స్క్రిప్ట్ వర్క్ చేస్తాను.` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారాయి.
కాగా, ప్రస్తుతం ఈయన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో `లైగర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.