డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై పూరి అండ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అధికారికంగా చార్మి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్నాని నిర్మించనున్నారు. త్వరలోనే మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను ప్రకటిస్తామని తెలియజేశారు. హీరోని మాస్ యాంగిల్లో ప్రెజెంట్ చేయడంలో పూరి దిట్ట. మరి ఇప్పటికే యూత్లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post
next post