పూరి జగన్నాధ్.. సినిమా తీయడంలో ఎంత వేగం ఉంటుందో.. దానికంటే ముందు కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే రాయడంలో కూడా అంతే వేగం ఉంటుంది. అంత టాలెంట్ ఉన్న పూరి లాక్ డౌన్ సమయంలో తన పెన్నుకు మరింత పదును పెట్టాడు. తనలో సినిమా టాలెంట్ తోపాటు.. ప్రపంచం, మనుషులు, వ్యవస్థ.. ఇలా ప్రతి విషయంపైనా తనకెంత అవగాహన ఉందో నిరూపించాడు. ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పోడ్ క్యాస్ట్, స్పాటిఫై, యూట్యూబ్ చానెల్స్ లో రిలీజ్ చేశాడు. ఇప్పుడీ ఎపిసోడ్స్ తన సినిమాల మాదిరిగానే రికార్డులు క్రియేట్ చేశాయి.
టాప్ 2020 పోడ్ క్యాస్టర్ గా పూరి మ్యూజింగ్స్ నిలవడం విశేషం ఇదే ఇప్పుడు తన ఎపిసోడ్స్ రికార్డులు క్రియేట్ అయ్యేలా చేసింది. స్పాటిఫై ఇండియాలో పూరి మ్యూజింగ్స్ 65 దేశాల్లో ప్లే అయ్యాయి. మొత్తం 540 నిమిషాల నిడివితో 152 ఎపిసోడ్స్ గా రిలీజ్ చేశాడు. మూడు దేశాల్లో 104 రోజులపాటు చార్ట్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచాయి. మొత్తంగా 68,193 మంది విన్నారు. పోడ్ క్యాస్ట్స్ లో ఇదే హయ్యస్ట్ రికార్డ్ గా నిలవడం విశేషం. ప్రపంచంలోని అనేక హిడెన్ న్యూస్ అందరికీ తెలిసేలా చెప్పాడు పూరి.
పూరి మ్యూసింగ్స్ లో ఎపిసోడ్స్ ను 5-6 నిముషాల్లోనే ముగిస్తాడు. ఇంత తక్కువ టైమ్ లోనే తాను చెప్పాలనుకున్నది వినేవాళ్లకి డైరక్ట్ గా వాళ్ల బుర్రకు ఎక్కేలా చెప్తాడు. ఇదే పూరి మ్యూజింగ్స్ లో స్పెషాలిటీ.ఈ వివరాలను పూరి కనెక్ట్స్ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో రివీల్ చేసింది. పూరి చెప్పే విషయాలు చాలా మందికి తెలీనవే ఎక్కువ. తన అనుభవాలు, శోధన, విషయ పరిజ్ఞానంతో పూరి ఆకట్టుకున్నాడని చెప్పాలి. పూరి జగన్నాధ్ అంటే మాస్ హీరో, మాసివ్ డైలాగ్స్, మాస్ మేనరిజమ్స్.. మాత్రమే గుర్తొచ్చే ప్రేక్షకులకు ఇకపై పోడ్ క్యాస్ట్ లో పూరి కొత్తగా ఏం చెప్తాడో అని ఎదురుచూసేలా చేశాడు.