Vijay Deverakonda: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం `లైగర్`. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టులో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
అయితే ఇది పూర్తైన వెంటనే విజయ్తో పూరీ మరో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. అదే `జనగణమన(జేజీఎం)`. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మొదట ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించినా.. పలు కారణాల వల్ల ఆయన సైడ్ అయ్యారు. ఆ తర్వాత ఈ మూవీ పవన్ వద్దకు వెళ్లగా.. ఆయన రిజెక్ట్ చేశాడు.
ఇక ఇప్పుడు ఈ మూవీలో విజయ్ నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియో బ్యాపర్లపై దర్శకుడు వంశీ పైడిపల్లి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. లైగర్లో విజయ్ కోసం ఓ బాలీవుడ్ భామను దింపిన పూరీ.. `జనగణమన` కోసం సైతం బాలీవుడ్ బ్యూటీనే ఎంచుకున్నారు.
ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని.. విజయ్ సరసన జాన్వీ నటించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఆగస్ట్ 3, 2023న విడుదల కానుంది.