ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. చాలా కాలం తర్వాత అందుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఉత్సాహం తో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు హిందీ తమిళం, కన్నడ లో రిలీజ్ చేసేలా చిత్రీకరణ జరుపుతున్నారు. వాస్తవంగా ఈ సినిమా ముంబై లో ఎక్కువ రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాడు పూరి. అలాగే బ్యాంకాగ్.. కాని కరోనా తో ఇప్పుడు బయట షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు.
దాంతో అన్ని సినిమాల మాదిరిగానే పూరి విజయ్ దేవరకొండ ల సినిమా కూడా ఎక్కువ్ శాతం సెట్స్ లో, స్టూడియోస్ లో ప్లాన్ చేస్తున్నారట పూరి. అయితే మిగతా సినిమాల మాదిరిగా టాకీ పార్ట్ కాకుండా ముందు ఈ సినిమాలో సాంగ్స్ తీయాలని డిసైడయ్యారట. సాంగ్స్ గనక అయితే హీరో హీరోయిన్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండరు ..దాంతో ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాధ్ ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫైటర్ తో పాటు ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమా కి ఉన్న బ్యాలెన్స్ షూట్ ని ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పూరి బాలకృష్ణ తో సినిమా చేస్తాడని సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!