Mahesh babu: పూరి జనగణమన ఎందుకు రిజెక్ట్ చేశాడో క్లారిటీ వచ్చేసింది..! అది కూడా తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముంబై మీడియాతో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన తర్వాత. బద్రి సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పూరి జగన్నాథ్ను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. దాంతో ఒక్కసారిగా పూరి హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ తీస్తూ వస్తున్న సమయంలో మహేశ్ బాబు హీరోగా పోకిరి సినిమాను తెరకెక్కించాడు.
చాలా తక్కువ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 75 సంవత్సరాలుగా ఉన్న రికార్డ్స్ అన్నిటినీ చెరిపేసింది. మహేశ్ బాబు, పూరి జగన్నాథ్ కెరీర్లో పోకిరి ఎప్పటికీ నిలిచినపోయిన మైల్ స్టోన్ మూవీ. దీని తర్వాత బిజినెస్ మేన్ సినిమాను తీశాడు పూరి ఇది కూడా భారీ కమర్షియల్ హిట్ సాధించింది. దాంతో జనగణమన అనే సినిమాను తీయాలని డిసైడయ్యాడు. కథ కూడా బాబుకు పూరి నరేట్ చేశాడు. కానీ, ఈ కథ నచ్చలేదని సింపుల్గా నో చెప్పాడు మహేశ్. హ్యాట్రిక్ సినిమా తీయాలనుకున్న ప్రాజెక్ట్ పెండిగ్ పడింది.
ఆ తర్వాత ఇదే కథ పవన్ కళ్యాణ్తో చేయాలనుకున్నాడు. కానీ, పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్తో తీసిన కూడా హ్యాట్రిక్ మూవీనే అయ్యేది. గత కొన్నేళ్ళుగా పూరి ఈ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్గా భావిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఆ కలను విజయ్ దేవరకొండతో నిజం చేసుకుంటున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛ్ అయింది.
Mahesh babu: అందుకే రిజెక్ట్ చేసి ఉంటాడని తెలుస్తోంది.
ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ.. ఈ ‘జనగణమన’ ఫిక్షనల్ స్టోరి అని, దేశ భక్తితో పాటుగా యుద్ధం నేపథ్యంలో సాగే కథ..అని తెలిపాడు. ఈ మూవీలో హీరో ఆర్మీ ఆఫీసర్, ఒక సైనికుడు డ్రీమ్ అని.. ఇందులో హీరో మిషన్ ‘జనగణమన’ (JGM) అని అన్నాడు. దాంతో ఈ సినిమా కథ, దాని నేపథ్యం ఏంటో క్లారిటీ వచ్చేసింది. అయితే, ఈ అంశాలే మహేశ్ను ఆకట్టుకోలేకపోయి ఉండవచ్చు. కారణం మహేశ్ సైనికుడు అనే సినిమాను చేశాడు. ఇదే నేపథ్యం కాకపోయినా ఆ సమయంలో మహేశ్ను ఈ కథ ఆకట్టుకోలేదు. బాలీవుడ్లో ఈ తరహా కథలు వచ్చి కొన్ని సక్సెస్ అయితే కొన్ని డిజాస్టర్గా నిలిచాయి. పైగా మహేశ్ ఈ పాత్రలో ఫిట్ అవనని భావించి ఉండవచ్చు. అందుకే రిజెక్ట్ చేసి ఉంటాడని తెలుస్తోంది.