Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ “లైగర్” తో మరో ఫ్లాప్ ఈ ఏడాదిలో తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అంతకుముందు వరుసపరాజయాలలో ఉన్న సమయంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కగా ఆ తర్వాత వెంటనే “లైగర్” రూపంలో మళ్ళీ పరాజయం ఎదురయింది. ఈ పరిణామంతో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన గాని నిర్మాతలు చేతులెత్తేశారు. ఇలాంటి తరుణంలో తన డ్రీం ప్రాజెక్టు జనగణమన కోసం పూరి జగన్నాథ్ ఇప్పుడు బాలీవుడ్ నీ ఆశ్రయించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి ఈ సినిమాని మొదట మహేష్ బాబు తో చేయాలని డిసైడ్ అయ్యారు. అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా విజయ్ దేవరకొండ తో ప్రకటించి ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. “లైగర్” పరాజయం చెందటంతో చాలా నష్టాలు రావడంతో జనగణమన నిర్మాతలు మధ్యలోనే ప్రాజెక్ట్ ఆపేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా తన డ్రీం ప్రాజెక్టు జనగణమన కంప్లీట్ చేయాలని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులతో పూరి జగన్నాథ్ చర్చలు జరుపుతున్నారట.
ఇందుకోసం రణవీర్ సింగ్ ఇంకా విక్కీ కౌశల్ నీ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పూరి జగన్నాథ్ ఈసారి సినిమాలు ఎక్కువగా హిందీలోనే చేయాలని అనుకుంటున్నారు అని టాక్. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరించే మనుషులు కావడంతో పూరి మకాం మొత్తం ముంబైకి మార్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో “లైగర్” ఎగ్జిబిటర్లకు నష్టాన్ని కూడా త్వరలోనే పూరి జగన్నాథ్ చెల్లించనున్నారంట.