డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ‘లైగర్’ టైటిల్ తో కూడిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
‘లైగర్’ అనే టైటిల్ పెట్టి క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ పెట్టడంతో సినిమా స్టోరీ ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద డిస్కషన్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత ఆగిపోగా తాజాగా ముంబైలో మళ్లీ మొదలు అవ్వడం జరిగింది.
దీంతో వచ్చే సమ్మర్ లో ‘లైగర్’ రిలీజ్ అని అందరూ డిసైడ్ అవుతూ ఉన్న తరుణంలో సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమా జూలై మాసంలో రిలీజ్ చేసే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” జూలై మాసం లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కావడంతో.. అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని ‘లైగర్’ జూలైలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!