Puri Jagganath : టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో మాస్ మహారాజా రవితేజ అని అందరికీ తెలుసు. దాదాపు ఇద్దరు కలిసి ఐదు సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. రవితేజ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి పూరి సినిమాలు చాలా వరకు సహకరించటం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హిట్ కాగా నేనింతే, దేవుడు చేసిన మనుషులు నిరాశపరిచాయి. ఇదిలా ఉంటే నేనింతే సినిమా వీరిద్దరికీ ఇండస్ట్రీ పరంగా మంచి పేరు తీసుకు రావడం జరిగింది.
Puri Jagganath పూరి డిసైడ్ అయినట్లు…
సినిమా అంటే ప్రాణం ఇచ్చే కుర్రవాడి పాత్రలో.. ఇండస్ట్రీలో రాణించాలని చూసే తపన, టాలెంట్ ఉన్న పాత్రలో రవితేజ నటన అప్పట్లో చాలామందినీ ఆకట్టుకోవటం జరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇండస్ట్రీ నేపథ్యంలో మరో సినిమా స్క్రిప్ట్ రవితేజ తో చేయటానికి పూరి డిసైడ్ అయినట్లు… త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కడం తో… మళ్లీ ఫామ్ లోకి.. రవితేజ రావటంతో… పూరి .. మాస్ మహారాజాతో ఆరోసారి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం పూరి జగన్నాథ్..విజయ్ దేవరకొండ తో “లైగర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తారీఖున రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిన వెంటనే మ్యాగ్జిమమ్ రవితేజతో పూరి జగన్నాథ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి.