ఆదివారం వరంగల్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే ఇంకా ఆలీ పలువురు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకానొక సమయంలో చాలామంది దర్శకులు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. వాటిని నువ్వు పట్టించుకోవడం లేదు “అర్జున్ రెడ్డి” సినిమా చూడు అని మా ఆవిడ చెప్పింది అని పూరి జగన్నాథ్ తెలియజేశారు.
ఫస్ట్ టైం “అర్జున్ రెడ్డి” చూసిన సమయంలో 45 నిమిషాలు చూసిన తర్వాత ఆఫ్ చేసేసాను. ఎందుకంటే సినిమాలో హీరో చాలా జెన్యూన్ గా నటించాడు. ఆ రోజే నేను విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యా. విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ. బయట మాత్రమే కాదు తాను నటిస్తున్న సమయంలో కూడా కనబడుతుంది. ఎక్కడ కూడా పొగరు కనిపించదు. సినిమాలలోనే కాదు బయట కూడా విజయ్ హీరో. నిర్మాతగా ఎప్పుడైనా విజయ్ కి డబ్బులు ఇస్తే తిరిగి సినిమాకే ఖర్చు పెట్టండి తర్వాత తీసుకుంటానని చెబుతాడు.
మేము అప్పుల్లో ఉన్నామని తెలిసి.. ఇచ్చిన డబ్బులు వెనకేచేసి ముందు అప్పులు తీర్చేయండి అని అన్నారు. విజయ్ దేవరకొండ ఫాదర్ నేను ఫ్రెండ్స్. మా వాడితో మంచి సినిమా తీ.. వాడిని నీ కొడుకు లాగా చూసుకో. కానీ విజయ్ నన్ను ఒక తండ్రి లాగా అద్భుతంగా చూసుకున్నాడు. సినిమా కోసం చాలా కష్టపడతాడు. నా కష్టాలలో విజయ చాలా తోడుగా ఉన్నాడు. ఇటువంటి హీరోని నేనెప్పుడూ చూడలేదు లవ్ యు విజయ్ అంటూ పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో స్పీచ్ ఇవ్వడం జరిగింది.