డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా తెరకకించడంలో స్టైలే వేరు. నెలలలో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చే దర్శకుడిగా పూరికి మంచి పేరు మొదటి నుండి ఉంది. చాలామంది హీరోల తలరాతలను మార్చిన దర్శకుడిగా మనోడు గురించి మాట్లాడుకుంటారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులలో పూరి సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. చాలామంది దర్శకులు సంవత్సరాలు తరబడి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కొడితే కేవలం పూరి జగన్నాథ్ మాత్రం నెలలలో సినిమాలు చేస్తూ విజయాలు సాధించటం పట్ల.. కొంతమంది స్టార్ రైటర్ లు కూడా ఆయనకు పోటీ లేదు అన్న రీతిలో పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు దాదాపు నెల రోజులకు పైగానే జరుగుతూ ఉన్నాయి. తాజాగా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నిర్మాతలలో ఒకరైన ఛార్మి… పూరి జగన్నాథ్ మరియు హీరో విజయ్ దేవరకొండ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ సినిమాలు చేయటం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాండమిక్ ముందు వెంట వెంటనే నా నుండి సినిమాలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం గతంలో లాగా రావు. చేసే ప్రతి సినిమా కోసం బాగా కష్టపడి కొంచెం టైం ఎక్కువ తీసుకుని చేస్తాను. “లైగర్” నుండి ఈ రీతిగానే సినిమాలు చేస్తాను అంటూ.. షార్ట్ టైంలో తన నుండి సినిమాలు ఇకనుండి రావు అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!