Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన “పుష్ప”… రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపద్యంలో తెరకెక్కిన బన్నీ మూవీ… ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా “పుష్ప” కలెక్షన్ లు సాధించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ భారీ ఎత్తున ఉండేలా డైరెక్టర్ సుకుమార్ .. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు ఇదే రీతిలో రెండో భాగానికి కూడా ఫుల్ క్రేజ్ వుండేలా అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే “పుష్ప” సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తాజాగా డైలమాలో పడినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయమేమిటంటే ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన.. రేమ్యున్ రేషన్ ఒక్కసారిగా పెంచటం జరిగిందట. దీంతో నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరగటంతో… పుష్ప సెకండ్ పార్ట్ ఓవరాల్ బడ్జెట్ .. భారీగా పెరిగిపోయినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు ఓవరాల్ బడ్జెట్ లెక్క ఎంతో ఎవరికి అర్ధం కానట్టు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా గాని “పుష్ప” రెండో భాగం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించలాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు అనుకుంటున్నట్లు టాక్. “పుష్ప” స్క్రిప్ట్ వర్క్ మొత్తం పనులు పూర్తి అయిన వెంటనే జూన్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి యధావిధిగా మళ్లీ డిసెంబర్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.