Pushpa movie: స్టైలిష్ స్టార్ బన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనోడు సినిమా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేకాక సౌత్ ఇండియాలో… భారీగా కలెక్షన్లు సాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రం లో బన్నీ సినిమా రిలీజ్ అంటే చాలు మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అటువంటి క్రేజ్ సౌత్లో చాలావరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్న వారిలో ఫస్ట్ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉండటంతో… తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “పుష్ప” పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతూ ఉండటం తో సినిమాపై అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.
గుబురు గడ్డం తో అల్లు అర్జున్ సినిమాలో కనిపిస్తూ ఉండటంతో…పాటు గంధపు చెక్కల స్మగ్లర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తూ ఉండటంతో… సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఆశ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహమ్మారి కరోనా ఉద్రిక్తత భారీగా ఉండటంతో… “పుష్ప” సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా రెండు పార్టులుగా వస్తున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయంతో తాజాగా ఈ సినిమా బడ్జెట్ మొత్తం 250 కోట్లు అన్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీ వర్గాల వినబడుతోంది.
అంతేకాకుండా స్క్రిప్ట్ లో అక్కడక్కడ కూడా సుకుమార్ చేంజ్ చేసినట్లు… సెకండ్ పార్ట్ చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపించాలని ఫస్ట్ పార్ట్ లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని చర్యలు లోనే అతి భారీ బడ్జెట్ సినిమా పుష్ప అని తాజా వార్తల పై అభిమానులు డిస్కషన్లు చేసుకుంటున్నారు. బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో మొట్టమొదటి సారిగా వస్తున్న ఈ సినిమా పై.. దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో అంచనాలు బాగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ సుకుమార్ ..మూడోసారి అల్లుఅర్జున్ తో పనిచేస్తూ ఉండటంతో అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!