Sukumar: ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగు పెట్టిన నాటి నుండి.. సుకుమార్ తన ప్రతి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే సినిమా ప్రేమికులు సినిమా స్టోరీ కంటే ఎక్కువగా .. సినిమాలో ఐటెం సాంగ్ ఏ తరహా లో ఉంటుందో అంటూ ఎక్కువగా డిస్కషన్లు చేసుకుంటారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ తెలుగు మ్యూజిక్ పరంగా హైలెట్ అయ్యాయి. ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం, జగడం సినిమాలో.. 36.. 26.. 24 అనే సాంగ్, ఆర్య 2 సినిమా లో ..రింగ రింగ సాంగ్..తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ హైలెట్ అవుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి ఐటమ్ సాంగ్స్ సెంటిమెంట్ కి డబల్ డోస్ అందించడానికి సుకుమార్ రెడీ అయినట్లు కొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది. ఫస్ట్ టైం సుకుమార్ పాన్ ఇండియా సినిమా చూస్తూ ఉండటం తో .. ఎక్కడా తగ్గడం లేదు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే హీరోయిన్ పూజా హెగ్డే ని కన్ఫామ్ చేయగా మరో హీరోయిన్ ని కూడా తీసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ రెడీ అయిందట.
పూర్తి మేటర్ లోకి వెళ్తే పూజా హెగ్డే తో పాటు దిశా పటాని చేత కూడా ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేయించడానికి సుకుమార్ రెడీ అయినట్లు సమాచారం. “పుష్ప” సినిమా ఐటమ్ సాంగ్ ఓ రేంజ్లో ఉంటుందని.. దీంతో సినిమాకే హైలెట్ అయ్యే తరహాలో నిర్మాతలు డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. అల్లు అర్జున్ స్టెప్పులు కూడా సరికొత్త విధంగా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.