Pushpa: సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప”(Pushpa) భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ సభ్యులు..సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డైరెక్టర్ సుకుమార్ కి రెండు బ్లాక్ బస్టర్ విజయాలు వరుసగా పడటం సంచలనంగా మారింది. పుష్ప(Pushpa) కి ముందు రామ్ చరణ్ తేజ్(Ram Charantej) తో రంగస్థలం(Rangasthalam) తో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు “పుష్ప”తో మరోసారి విజయం సాధించి… టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం సుకుమార్ పాన్ ఇండియా తరహాలో సినిమాని తెరకెక్కించడంతో అవుట్ పుట్ బాగా రావడంతో… సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో… రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో సినిమా యూనిట్ సంతోషంగా ఉంది.
ఈ నేపథ్యంలో వరుసగా గత కొన్ని రోజుల నుండి పుష్ప యూనిట్ సక్సెస్ సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా డిసెంబర్ 28వ తారీఖు నిర్వహించిన సక్సెస్ మీట్ లో… తమ కెరీర్ గురించి అల్లు అర్జున్.. సుకుమార్ మాట్లాడి చాలా ఎమోషనల్ కి గురయ్యారు. ఈ సందర్భంగా సినిమా ఈ రేంజ్ లో హిట్ అవటానికి.. చాలా మంచి పని చేశారు కానీ సెట్ బాయ్స్.. లైట్ బాయ్స్.. చేసిన పని మర్చిపోలేనిది ఎవరు చేయలేరు అని సుకుమార్ స్పీచ్ ఇచ్చారు.
ఎక్కడో మారుమూల అడవుల్లో అది దాదాపు రోజంతా పనిచేస్తూ శారీరకంగా… బాగా కష్ట పడ్డారు. నిజంగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వారి కష్టాన్ని చూసి తిరిగి వీరికి ఏదైనా ఇవ్వాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఈ సందర్భంగా సెట్ బాయ్స్.. లైట్ మెన్స్ కి.. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు.. బంపర్ ఆఫర్ ప్రకటించారు డైరెక్టర్ సుకుమార్. ఆర్య నుండి సెట్ బాయ్స్ రంగా బ్యాచ్… నా సినిమా తో ట్రావెల్ అవుతూ వస్తున్నారు. బాగా కష్ట పడతారు ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం వెనకాల వేరే కృషి కూడా ఉందని.. లక్ష రూపాయలు ఒక్కరికి ఇస్తున్నట్లు సుకుమార్ ప్రకటించారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!