Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బన్నీ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.
టాక్ ఎలా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టి దుమ్ముదులిపేసింది. అయితే తెలుగు వర్షన్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినా.. హిందీ, తమిళ్ భాషల్లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పటికీ పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప తమిళనాడు లో ఏకంగా రూ. 30 కోట్ల షేర్ను వసూల్ చేసి ప్రభంజనం సృష్టించింది.
ఇప్పటి వరకు అక్కడ విడుదల అయిన తెలుగు చిత్రాల్లో బాహుబలి సిరీస్ తర్వాత భారీ వసూళ్ళను రాబట్టిన చిత్రం గా పుష్ప రికార్డు నెలకొల్పింది. దీంతో ప్రభాస్ తర్వాత ఆ సూపర్ రికార్డ్ బన్నీదే అని, టాలీవుడ్లో ఇంకెవ్వరికీ దక్కలేదని అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, బన్నీ ప్రస్తుతం పుష్ప 2పై ఫోకస్ చేశాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రం డిసెంబర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.