Anasuya: బుల్లితెర మీద పాపులర్ యాంకర్గా క్రేజ్ తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ క్షణం – సోగ్గాడే చిన్ని నాయనా – రంగస్థలం లాంటి సినిమాలు చేసింది. అలాగే ఎఫ్ 2 లాంటి సినిమాలలో స్పెషల్ నంబర్స్ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సమంత జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. ఈ సినిమాలో చరణ్, సమంతలకు ఎంతటి పేరొచ్చిందో..రంగమ్మత్తగా నటించిన అనసూయకు అంతే పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత అనసూయ ఎక్కడ కనిపించిన రంగమ్మత్త అని పిలిచారు. అంత క్రేజ్ తీసుకువచ్చాడు దర్శకుడు సుకుమార్.
అయితే మళ్ళీ అలాంటి పాత్ర చేసే అవకాశం అనసూయకు దక్కలేదు. మధ్యలో చేసిన పాత్రలకు అంత పేరు రాలేదనే చెప్పాలి. ఇక మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా అంటే అనసూయ నటించే అవకాశం అందుకుంది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. డివైడ్ టాక్ వచ్చినా కూడా తెలుగుతో పాటు మిగతా భాషలలోనూ వసూళ్ళ సునామీని సృష్ఠిస్తోంది. ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ ఊహించలేదు. ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాలో కీలక పాత్ర అనసూయ గురించి మాత్రం ఎక్కడా వినిపించడం లేదు.
Anasuya: అనసూయకు పుష్ప పార్ట్ 1వల్ల ఒరిగింది మాత్రం ఏమీ లేదు.
రంగస్థల రిలీజైనప్పుడు ఆమె పాత్రకు దక్కిన ఆదరణతో బాగా అనసూయ గురించి చెప్పుకున్నారు. కానీ, పుష్ప: ది రైజ్ పార్ట్ 1లో అనసూయ చేసిన దాక్షాయణి పాత్ర తేలిపోయిందని చెప్పుకుంటున్నారు. అయితే పార్ట్ 2లో అనసూయ పాత్ర బాగా ఎలివేట్ అవుతుందని..ఆమెది చాలా ఇంపార్టెంట్ రోల్ అని మేకర్స్ చెబుతున్నారు. మరి పార్ట్ 1లో లేని పాత్రకు పార్ట్ 2 ఎలా ఇపార్టెంట్ ఉంటుందని అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో కలుగుతున్న సందేహం. సుకుమార్ మీద అనసూయ ఈసారి పెట్టుకున్న నమ్మకాలు మాత్రం నిజం కాలేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడిగి మరీ అల్లు అర్జున్ సినిమాలో పాత్ర దక్కించుకున్న అనసూయకు పుష్ప పార్ట్ 1వల్ల ఒరిగింది మాత్రం ఏమీ లేదు.