SIIMA 2022: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన “పుష్ప” భారీ విజయం సాధించటం తెలిసిందే. ఫస్ట్ టైం డైరెక్టర్ సుకుమార్ కి హీరో బన్నీకి “పుష్ప” పాన్ ఇండియా ప్రాజెక్ట్. చాలా వైవిధ్యమైన స్టోరీతో … హీరో మేనరిజం ఇంకా భాష అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు.
దీంతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఊహించని విజయం “పుష్ప”కి దక్కింది. బాలీవుడ్ లో కనీసం ప్రమోషన్ కార్యక్రమం చేయకపోయినా గాని ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు “పుష్ప” సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు సైమా 2022 అవార్డులలో సత్తా చాటింది. 12 కేటగిరీలో పోటీ పడ్డ ఈ సినిమాకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం రెండు అవార్డ్స్ వచ్చాయి. ఒకటి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా “పుష్ప”కి సంబంధించి దేవి శ్రీ ప్రసాద్ కి అవార్డు రావడం జరిగింది.
అంతేకాదు బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ అవార్డు కూడా “పుష్ప” లో బన్నీ పక్కన నటించిన.. జగదీష్ కి రావడం జరిగింది. పుష్ప సినిమాలో జగదీష్ క్యారెక్టర్ సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాదు జగదీష్ పాత్రని ఆడియోన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ దక్కించుకున్నాయి. మ్యూజిక్ పరంగా ముందుగానే పుష్పాకి మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ప్రేక్షకులలో నెలకొంది. సో సైమా 2022 వేడుకలలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ కి బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ జగదీష్ కి సైమా అవార్డులు వచ్చాయి. సెప్టెంబర్ 10 మరియు 11 తారీఖు లలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు “పుష్ప” ఇంకా పలు తెలుగు సినిమాలకు సంబంధించిన నటీనటులకు అవార్డులు వచ్చినట్లు సమాచారం.