సోషల్ మీడియాలో భాగమైన టిక్టాక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అలాంటి టిక్ టాక్లో సెలబ్రిటీ అర్నా పాత్రలో రాశీఖన్నా మెప్పించనుంది. ఇంతకు ఈమె టిక్టాక్ సెలబ్రిటీగా ఎందుకు మారిందో తెలుసా? ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కోసం. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి రాశీఖన్నా మాట్లాడుతూ “ముందు ఈ క్యారెక్టర్ గురించి వినగానే టిక్టాక్ సెలబ్రిటీ ఏంటి? అని అనుకున్నాను. అయితే కామెడీ ట్రాక్లో భాగంగానే నా పాత్ర సాగుతుందని తెలిసి ఓకే చెప్పాను. ‘జిల్’ తర్వాత అలాంటి బబ్లీ క్యారెక్టర్ చేసింది ఈ సినిమా కోసమే. కాబట్టి పాత్ర బాగా చేయాలని కొంత మంది టిక్ టాక్ సెలబ్రిటీలను కూడా కలుసుకున్నాను. మారుతిగారు నా పాత్రను చక్కగా డిజైన్ చేశారు. కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా సినిమాలో ఉంటుంది. మారుతిగారి సలహా మేరకు సినిమాలో ఓ పాట కూడా పాడాను. అయితే సమయం లేకపోవడంతో డబ్బింగ్ చెప్పుకోలేకపోయాను” అన్నారు.
previous post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!