Radhe shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 6 సినిమాలను ఆయన లైన్ లో పెట్టారు. వీటిలో ఇప్పటికే 2 భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమాలను కంప్లీట్ కూడా చేశారు. ఈ రెండింట్లో రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను జరుపుకుంటోంది. విజువల్ వండర్గా రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ప్రభాస్ సహా అందరూ దాదాపు మూడేళ్లకు పైనే కేటాయించారు. కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ మూవీ రిలీజ్ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 1970వ దశకంలో యూరప్ నేపథ్యంలో సాగే పిరియాడిక్ లవ్ స్టోరీగా ‘రాధేశ్యామ్’ సినిమాను యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. బాలీవుడ్ మేకర్స్ టి సిరీస్ వారితో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు. ప్రభాస్ సోదరి ఈ సినిమాతో నిర్మాతగా మారడం విశేషం. ఇక రిలీజ్ మరో రెండు వారాలు మాత్రమే ఉంది.
Radhe shyam: మ్యాజికల్ స్క్రీన్ ప్లే ఉంటుందని అది సినిమాలో చూడాల్సిందే..!
ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో రాజులు యువరాజులు సహా ప్రెసిడెంట్ – ప్రైమ్ మినిస్టర్ లాంటి వారికి పామాలజీ గురించి చెప్పే ప్రముఖ హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనున్నారని, ఇలాంటి కథా నేపథ్యంలో వస్తున్న మొట్ట మొదటి సినిమా ప్రపంచంలో ఇదే మొదటిదని రాధాకృష్ణకుమార్ తెలిపారు. దాంతో
కథలోని మేయిన్ పాయింట్ రివీల్ అయిందని ప్రభాస్ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి దర్శకుడు కథలోని కీలక పాయింట్ రివీల్ చేసినా మ్యాజికల్ స్క్రీన్ ప్లే ఉంటుందని అది సినిమాలో చూడాల్సిందేని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?