Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రమే `రాధేశ్యామ్`. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. కృష్ణం రాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు కీలక పాత్రలను పోషించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది.
పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులున్న హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్ నటించాడు. ప్రేరణగా పూజా హెగ్డే మెరిసింది. ఓ అందమైన చిన్న ప్రేమకథని గ్రాండ్గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథ రొటీన్గానే ఉన్నా.. లొకేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.
ఇక టాక్ ఎలా ఉన్నప్పటికీ.. రాధేశ్యామ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా భారీ కలెక్షన్లను రాబట్టింది. తెలుగుతో రాష్ట్రాల్లో రూ. 25.49 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.38.37 కోట్లు రాబట్టింది. ఏరియాల వారీగా `రాధేశ్యామ్` ఫస్ట్ డే కలెక్షన్ ఇలా ఉన్నాయి.
నైజాం- 10.80 కోట్లు
సీడెడ్- 3.50 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.95 కోట్లు
తూర్పు గోదావరి- 2.60 కోట్లు
పశ్చిమ గోదావరి- 2.01 కోట్లు
గుంటూరు- 2.60 కోట్లు
కృష్ణ- 0.95 కోట్లు
నెల్లూరు- 1.08కోట్లు
——————————————————————
ఏపీ+తెలంగాణ మొత్తం- 25.49కోట్లు(37కోట్లు~ గ్రాస్)
——————————————————————
కర్ణాటక- 2.70 కోట్లు
తమిళనాడు- 0.30 కోట్లు
కేరళ- 0.08 కోట్లు
హిందీ- 2.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా-0.80 కోట్లు
ఓవర్సీస్ – 6.75 కోట్లు
————————————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్- 38.37కోట్లు(64కోట్లు~ స్థూల)
————————————————————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 202.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. రూ.204 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. ఇప్పుడీ మూవీ క్లీన్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ.165.63 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది.