Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ మూవీ మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ వేరె లెవల్లో ప్రమోషన్స్ నిర్విస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ను పొందింది. ఈ సందర్భంగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు `రాధేశ్యామ్`పై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
`రాధేశ్యామ్ సినిమా చూశాను. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్- పూజాల కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్గా అనిపించింది. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇదొక యూనిక్ సబ్జెక్ట్. ఇంకా చెప్పాలంటే రాధేశ్యామ్.. క్లాసిక్, స్టైలిష్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్. ప్రభాస్ డ్రెస్సింగ్, యాక్టింగ్ అద్భుతం. ఇండియాలో ఆయన క్లాస్, స్టైల్ను బీట్ చేసేవాళ్లే లేరు` అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
ఇక ఉమైర్ సంధు రివ్యూ బట్టీ చూస్తుంటే.. రాధేశ్యామ్ ఖచ్చితంగా హిట్ అయ్యేలానే కనిపిస్తోంది. కాగా, ఇటలీ బ్యాక్డ్రాప్లో వింటేజ్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు కీలక పాత్రలను పోషించారు. అలాగే ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించబోతున్నాడు.