Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” వంటి భారీ విజయం తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని “సాహో”.సినిమా చేశారు. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల పాటు టైం కేటాయించి చివరాకరికి రిలీజ్ చేసి అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా పరాజయం పాలు కావడంతో అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు. ఇటువంటి తరుణంలో తన కెరియర్ కి ఎంతగానో కలిసొచ్చిన క్లాస్ సినిమాలను సెలక్ట్ చేసుకుని జిల్ ఫ్రేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమకథా నేపథ్యంలో గత సంవత్సరన్నర పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది జూలై 31వ తారీఖున రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
యు.వి.క్రియేషన్స్ కృష్ణం రాజు నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తున్న నేపథ్యంలో.. పైగా పాన్ ఇండియా మూవీ కావడంతో.. అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. పరిస్థితి ఇలా ఉండగా బయట కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు మరియు మరణాలు బట్టి చూస్తే.. థియేటర్లు మళ్ళీ కొద్ది నెలలపాటు ఓపెన్ అయ్యే ప్రసక్తి లేదన్నట్టు బయట వార్తలు వస్తున్నాయి.
వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ కూడా చాలా నత్తనడకన సాగుతోంది. ఇలాంటి తరుణంలో సినిమా మళ్ళీ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు రావడంతో.. సినిమా యూనిట్ అలర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో చెప్పినట్టే జూలై 31 వ తారీకు .. సినిమా థియేటర్ లోకి వస్తది అప్పటి పరిస్థితులు మారకపోతే.. ఎప్పుడైతే పరిస్థితులు మారుతాయో అప్పుడే “రాధేశ్యాం” రిలీజ్ చేస్తామని తాజాగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు ఫిలింనగర్ టాక్. పాతకాలం నాటి ప్రేమకథా నేపథ్యంలో “రాధేశ్యాం” తెరకెక్కింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!