Radhe shyam: కొత్త ప్రమోషనల్ కంటెంట్తో వస్తున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన లేటెస్ట్ సినిమా ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 2022, మార్చి 11న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్
దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకి రెండు వారాలు మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇంకా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించలేదు. దాంతో ప్రమోషనల్ ఈవెంట్స్ ఎప్పుడూ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ మేకర్స్ను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.
ఇక ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, 4 పాటలు.. ప్రభాస్ అభిమానులను, అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం స్టార్ట్ చేసినప్పుడు చిత్రబృందం నుంచి ఫ్యాన్స్ కోరుకున్నంత స్పీడ్గా అప్డేట్స్ రాలేదు. అయితే, ఆ తర్వాత మాత్రం ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్ బాగానే వదిలారు. అలాగే, మూవీ ఫస్ట్ గ్లింప్స్ ..టీజర్స్.. ట్రైలర్ వచ్చి అభిమానులను బాగానే సర్ప్రైజ్ చేశాయి. అయితే, ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మాత్రం సైలెంట్గా ఉన్నారని ఫ్యాన్సే కామెంట్స్ చేస్తున్నారు.
Radhe shyam: స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్..!
ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘రాధేశ్యామ్’ టీమ్ కొత్త ప్రమోషనల్ కంటెంట్తో వచ్చేందుకు రెడీ అవుతుందట. ఇప్పటి కే, మేకర్స్ కొత్త ట్రైలర్ను కూడా కట్ చేశారట. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా రెడీ చేస్తున్నట్టు తాజా సమాచారం. అంతేకాదు, అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 5వ పాటను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మార్చి ఫస్ట్ వీక్ నుంచే చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాన్ స్టాప్గా ఈ కొత్త కంటెంట్తో ప్రమోషన్స్ చేస్తారట. దీనిలో భాగంగానే స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేయనున్నారని తాజాగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.