Radheshyam: ఒక్కదెబ్బకే బాలీవుడ్లో పడిపోయిన ప్రభాస్ గ్రాఫ్..ఇకపై అక్కడ కష్టమేనా..? అంటూ నెటిజన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారట. అందుకు కారణం డార్లింగ్ ఎన్నో అంచనాలు, నమ్మకాలు పెట్టుకొని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘రాధేశ్యామ్’. బాహుబలి తర్వాత ప్రభాస్కు హిం సీమలో పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి సిరీస్తో ప్రభాస్కు పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ దక్కింది. దీంతో పాటు బాలీవుడ్లో ఆయనకు విపరీతంగా మార్కెట్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే అక్కడ హీరో లకు కూడా మన ప్రభాస్ గట్టి పోటీగా నిలబడ్డాడు.
కానీ, దాన్ని కంటిన్యూ చేయడంలో మాత్రం ప్రభాస్ ఫెయిల్ అయ్యాడని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ మీద గట్టి పట్టు సాధించాలనుకున్నారు. సాహో సినిమా అన్నీ చోట్లా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చిప్పటికీ హిందీలో మాత్రం రూ. 150 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టి సత్తా చాటారు. అందుకే, హిందీలో స్ట్రైట్ సినిమాగా ఆదిపురుష్ చేసే అవకాశాన్ని అందుకున్నారు. అలాగే, ఆయన చేస్తున్న సినిమాలను భారీ స్థాయిలో బాలీవుడ్లో రిలీజ్ చేయనున్నారు.
Radheshyam: మరో కారణం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా కూడా.
అయితే, ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ళు వస్తున్నాయని అంటున్నారు గానీ, ఇది ఎంతవరకూ నిజమైనవో తెలియడం లేదు. వాస్తవంగా ‘రాధే శ్యామ్’ సినిమా హిందీ వెర్షన్ రూ. 100 కోట్ల వరకు వసూళ్ళు రాబడుతుందని అంచనా వేశారు. కానీ, బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ఓవరాల్ రన్ లో రూ. 20 కోట్ల నెట్ లోపే క్లోజ్ అయ్యే అవకాశం ఉందట. దీన్ని బట్టి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీతో హిందీ సీమలో భారీ ప్లాప్ అందుకున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా వసూళ్ళ కు ఇంత ఘోరంగా దెబ్బపడానికి మరో కారణం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా కూడా.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?