Radheshyam: అమితాబ్ మాత్రమే కాదు ప్రభాస్ కోసం వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అవును ఈ సినిమా కోసం సౌత్ స్టార్స్ అందరూ బయలుదేరుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘సాహో’ తరువాత ప్రభాస్ నుంచి ఇంత వరకు మరో మూవీ రాలేదు. అది కూడా రొమాంటిక్ లవ్ స్టోరి. పదేళ్ళైంది ప్రభాస్ నుంచి కంప్లీట్ లవ్ స్టోరి రాలేదు. డెస్టినీకి ప్రేమకు మధ్య సాగే అద్భుతమైన రొమాంటిక్ ప్రేమ కథగా రాధే శ్యామ్ సినిమాని యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్ నిర్మించగా, టీ సిరీస్ సహ నిర్మాతగా వ్యవహరించింది.
కృష్ణం రాజు సమర్పించారు. ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. ఎన్నో ప్రత్యేకతలతో మార్చి 11న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అలాగే, చైనీస్, జపనీస్ ఒకేసారి విడుదల కాబోతోంది. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించిన ఈ మూవీని పిరియాడిక్ డ్రామాగా రూపొందించారు. ఇక ఇందులో ప్రభాస్ పెదనాన్న కీలక పాత్రల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ నటించారు. ప్రభాస్ పామిస్ట్ (హస్తసాముద్రిక నిపుణుడు)గా నటిస్తుండటం విశేషం.
Radheshyam: ప్రభాస్ మీద అభిమానంతోనే వీరందరూ మేకర్స్ అడగగానే ఒప్పుకున్నారట.
అయితే, ఈ సినిమా కోసం ‘రాధేశ్యామ్’ మూవీ మేకర్స్ క్రేజ్ స్టార్స్ను రంగంలోకి దింపేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించారు. అలాగే, కన్నడ వెర్షన్కు వాయిస్ ఓవర్ అందించేందుకు రాఖీ భాయ్ యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక తమిళ వెర్షన్కు గానూ హీరో సూర్య వాయిస్ అందించనున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో మలయాళంలో మోహన్ లాల్ గానీ, ఆయన తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇక మన తెలుగు వెర్షన్కు సూపర్ స్టార్ మహేష్ బాబు గానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గానీ ‘రాధేశ్యామ్’ కథని నరేట్ చేసే బాధ్యతల్ని తీసుకున్నారట. ప్రభాస్ మీద అభిమానంతోనే వీరందరూ మేకర్స్ అడగగానే ఒప్పుకున్నారట.