Radhey Shyam: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన “రాధేశ్యాం” ఈ నెల 11 వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ అందించడం జరిగింది. అంతే కాకుండా ఈ సినిమా రన్ టైం మొత్తం కలిపి 150 నిమిషాలు అనగా రెండు గంటల… పదిహేను నిమిషాలు .. అంట. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా ఫస్ట్ టైం నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాతకాలం నాటి ప్రేమకథా నేపథ్యంలో… భవిష్యత్ జ్ఞానం కలిగిన వ్యక్తిగా.. చేతి రేఖలు చూసి అని చెప్పే విక్రమాదిత్య క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు.
ఇక ఇదే సమయంలో హాస్పిటల్ లో వర్క్ చేసే నర్సు పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తోంది. సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే రొమాన్స్ … సినిమాకి హైలెట్ అని టాక్. క్లైమాక్స్ ఎపిసోడ్ లో … ప్రపంచాన్ని నాశనం చేసే సునామి.. ఉంటుందని టైటానిక్ తరహాలో.. ప్రభాస్ పూజ హెగ్డే ప్రేమ కథ ముగుస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత.. ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల మైండ్ సెట్ బట్టి.. ఈ సినిమా చిత్రీకరించినట్లు ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్లోనే ఒక మైలురాయిగా .. హిస్టరీ క్రియేట్ చేసే సినిమాగా “రాధేశ్యాం” మిగిలిపోనుంది అని అంటున్నారు.
కృష్ణం రాజు నిర్మాణ సంస్థ గోపి కృష్ణ మూవీస్ మరియు యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. ప్రభాస్ కెరీర్లోనే హై బడ్జెట్ సినిమా. దీంతో చాలా కాలం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతున్న తరుణంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమా నిడివి పెద్దగా లేకుండా రెండు గంటల పదిహేను నిమిషాలు ఉండటంతో తక్కువ టైంలోనే.. సినిమా ఉందని తాజా వార్త పై ఫాన్స్ రియాక్ట్ అవుతున్నారు.