RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఈనెల 21వ తారీకు జపాన్ దేశంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఈరోజు జపాన్ దేశానికి బయలుదేరారు. అక్కడ సినిమాకి సంబంధించి టాప్ మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దాదాపు మూడు రోజులపాటు సినిమా యూనిట్ జపాన్ లో పర్యటించనున్నారట.
మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “RRR” అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇండియాలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. కొన్నిచోట్ల బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాన్ ఇంగ్లీష్ సినిమా జాబితాలో ఎక్కువ వ్యూస్ అందుకున్న సినిమాగా ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొన్ని వారాలు పాటు నిలిచింది. ఈ సినిమా ద్వారా అంతర్జాతీయంగా రాజమౌళి క్రేజ్ మరింత పెరిగింది.
బాహుబలి సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు జక్కన్న సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా జపాన్ దేశంలో “బాహుబలి” భారీ ఎత్తున అప్పట్లో కలెక్షన్ సాధించింది. ఆ క్రేజీ దృష్ట్యా ఇప్పుడు “RRR” విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్కార్ రేసులో “RRR” ఉన్న నేపథ్యంలో జపాన్ లో సినిమా రిలీజ్ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా వెళ్లడం జరిగింది. చాలావరకు చూసుకుంటే ఫ్యామిలీలతో “RRR” జపాన్ ప్రమోషన్ కార్యక్రమాలకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా నెలల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్ లోకి రాజమౌళి, తారక్, చరణ్ కనిపించనున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.