Rajamouli Mahesh: దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఎల్లుండా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవిదేశాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదే సమయంలో రాజమౌళి కూడా “బాహుబలి” కి మించి విజయం సాధించాలని “RRR” కి సంబంధించి ప్రతి సీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా మహమ్మారి కరోనా రావటంతో టైం బాగా కలిసి రావడంతో జక్కన్న ప్రతి సీన్ విషయంలో చాలా హోమ్ వర్క్ చేయడం జరిగింది. అలాగే చరణ్, ఎన్టీఆర్ ఫస్ట్ టైం కలిసి నటించడం సినిమాకు అదనపు ఆకర్షణగా వచ్చింది.
ఇదిలా ఉంటే “RRR” తర్వాత రాజమౌళి .. మహేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ఇంగ్లీష్ ఇంటర్వ్యూ లో క్రేజీ అప్ డేట్ జక్కన్న ఇవ్వడం జరిగింది. మేటర్ లోకి వెళ్లి తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తోనే నో డౌట్ అని చెప్పటం జరిగింది. అంతమాత్రమే కాకుండా మహేష్ ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ కంటే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అని వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పై వర్క్ జరుగుతుందని రాజమౌళి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
దీంతో మహేష్ “సర్కారు వారి పాట” తర్వాత త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేశాక రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మే 12వ తారీకు వేసవికి విడుదల కానుంది. ఏదైనా వెంటనే త్రివిక్రమ్ షూటింగ్ లో మహేష్ జాయిన్ .. అయ్యాక సినిమా కంప్లీట్ చేశాకే రాజమౌళి సినిమా చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు టాక్. మేటర్ లోకి వెళితే జూన్ నెలలో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో… ఎటువంటి అడ్డంకి లేకుండా వచ్చే ఏడాది ప్రశాంతంగా షూటింగ్ స్టార్ట్ చేయాలని రాజమౌళి మహేష్.. డిసైడ్ అయినట్లు టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!