Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పనులను పక్కన పెట్టి ఆ హీరో కోసం పనులు మొదలు పెట్టారట. ఒకవేళ అనుకున్న తేదీకి గనక ఆర్ఆర్ఆర్ రిలీజై ఉంటే ఇప్పట్లో రాజమౌళి ఆ సినిమా సక్సెస్ మూడ్ నుంచి బయటకు వచ్చి ఉండేవారు కాదేమో. కానీ, రాజమౌళి అనుకున్న ప్లాన్స్ మొత్తం రివర్స్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆలోచించకుండా మహేశ్ కోసం పనులు మొదలు పెట్టినట్టు లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నో ఏళ్ళ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ప్రాజెక్ట్ ఇది.
రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్లో అనగానే కొన్నేళ్ళ నుంచి ఆయన అభిమానులు ఈయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, మహేశ్ వేరే సినిమాలతో రాజమౌళి వేరే సినిమాలతో బిజీ అవడం వల్ల వీరి కాంబోలో అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఎట్టకేలకి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ పనులు మొదలైనట్టు తెలుస్తోంది. మరో రెండు నెలల వరకు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఇప్పటికే నెలరోజుల పాటు దాదాపు రూ 20 కోట్ల వరకు ఖర్చు చేసి ప్రమోషన్స్ నిర్వహించి నిరాశపడ్డారు.
Rajamouli: పూర్తి స్థాయిలో సిద్దం చేసేయాలని రాజమౌళి డిసైడయ్యారట.
ఇక కొత్త ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టడమే ఉత్తమమని జక్కన్న డిసైడయి మహేశ్ కోసం తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలను, లైన్స్ను వింటున్నారట. వీటిలో మహేశ్ కోసం ఓ సాలీడ్ స్టోరీని ఫైనల్ చేసి దానిని పూర్తి స్థాయిలో సిద్దం చేసేయాలని రాజమౌళి డిసైడయ్యారట. ఇక ఈ సినిమాను శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. మరి ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ను ఎంత బడ్జెట్తో నిర్మిస్తారో చూడాలి. ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట పూర్తి చేయాల్సి ఉంది. దీని తర్వాత త్రివిక్రమ్మ్ సినిమాను పూర్తి చేయాలి. ఆ తర్వాతే రాజమౌళితో సెట్స్ మీదకు వస్తాడు.