Mahesh Babu: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు అంతా ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ మూడ్లోనే ఉన్నారు. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ వసూళ్ళు రాబట్టి రాజమౌళికి దర్శకుడిగా తిరుగులేదని మళ్ళీ నిరూపించింది. సినిమా కోసం రెండేళ్ళు.. మూడేళ్ళు.. నాలుగేళ్ళు సమయం తీసుకుంటాడనే కామెంట్స్ వినిపిస్తున్నా కూడా తీరా ఆయన సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద సృష్ఠించే వసూళ్ళ సునామీ దెబ్బకి ఈ కామెంట్స్ అన్నీ ఎక్కడో కలిసిపోతున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్..చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా విదేశాలలోను హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాలుగా నిలిచాయి.
దాంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మరో మెట్టు పైకెక్కారు. ఇప్పుడు అందరూ మాట్లాడు తుంది మహేశ్ బాబుతో జక్కన్న ఏ రేంజ్ సినిమాను తీయబోతున్నారు. దీని కథ ఎలా ఉండ బోతోంది..అందులో మహేశ్ రోల్ ఏంటీ..బడ్జెట్ ఎంత…ఇక ఫైనల్గా ఈ సినిమాను జక్కన్న ఎన్నేళ్ళు చెక్కుతాడు అని. అంతటా అందరిలో ఇప్పుడు ఇదే చర్చలు సాగుతున్నాయి. అయితే, ఇప్పటికే ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాపై రక రకాల రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంతకముందు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్లో మహేశ్ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు.
Mahesh Babu: మహేశ్ను జేమ్స్ బాండ్ తరహాలో సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని..
తాజా సమాచారం ప్రకారం రాజమౌళి మహేశ్ బాబును రా ఏజెంట్ తరహా పాత్రలో చూపించ నున్నారట. అంతేకాదు, ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ 400 కోట్ల బడ్జెట్ నిర్మాతకు ఇచ్చినట్టు తెలుస్తోంది. హాలీవుడ్లో రూపొందిన ప్రిడేటర్, మ్యాట్రిక్స్ తరహాలోనే సైన్స్ ఫిక్షన్ అంశాలను జతచేస్తూ కథ తయారు చేస్తున్నారట. స్పై థ్రిల్లర్ కథాంశంతో హై టెక్నికల్ వ్యాల్యూస్తో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఎంతో కాలంగా
అభిమానులు మహేశ్ను జేమ్స్ బాండ్ తరహాలో సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆశ పడుతున్నారు. ఆ కోరికను రాజమౌళి తీర్చనున్నట్టు తెలుస్తోంది.