RRR: దుబాయ్ ఎక్స్ పోలో రాజమౌళి టీమ్ హంగామా ఉండబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్, బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ హీరోయిన్స్గా నటించారు. మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్, దర్శక, నటుడు సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్చి 25న విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి వచ్చిన పాటలతో పాటు, ప్రచార చిత్రాలు, టీజర్స్, భారీ థియేట్రికల్ ట్రైలర్ మూవీపై విపరీతంగా అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 18 న సాయంత్రం 4.30 పీఎం నుంచి దుబాయ్ ఎక్స్ పో 2020లో రామ్ – భీమ్ అభిమానుల సందడి స్కై రేంజ్లో ఉండబోతోంది.
RRR: ఒకవైపు బడ్జెట్ పెరుగుతున్నా కూడా ప్రమోషన్స్ మాత్రం వీర లెవల్లో..!
అక్కడ అభిమానులను ఫేవరెట్ స్టార్స్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలుసుకోబోతుండడంతో అందరూ ఎంతో ఎగ్జయిట్మెంట్ తో ఉన్నారు. ఇక దుబాయ్ ఎక్స్ పో 2020లో తమ అభిమానులను కలవడానికి ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సహా మిగతా ప్రధాన నటీనటులు పాల్గొనబోతున్నారు. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్ సహా సౌత్ స్టార్స్ కూడా ముఖ్య అతిథులుగా జాయిన్ కానున్నట్టు తాజా సమాచారం. మొత్తానికి ఒకవైపు బడ్జెట్ పెరుగుతున్నా కూడా ప్రమోషన్స్ మాత్రం వీర లెవల్లో చేస్తున్నారు. మరి ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి కొత్త చరిత్ర సృష్ఠిస్తుందో చూడాలి.