RRR: “ఆర్ఆర్ఆర్” ఈ సినిమా మార్చి 25 వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంటర్వ్యూ లతో… బిజీబిజీగా చరణ్, ఎన్టీఆర్, జక్కన్న గడుపుతున్నారు. దీనిలో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్బళ్లాపూర్లో జరిగింది. ఈ క్రమంలో రాజమౌళి తన ప్రసంగంలో ఈ సినిమా గురించి ఇంకా అనేక విషయాల గురించి తెలియజేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి థాంక్స్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.. “మా సినిమా టికెట్ రేట్లు అడిగినప్పుడు.. అర్థం చేసుకుని అటూ సినిమా టికెట్ రేట్లు మరి పెంచకుండా అలాగే పేద వాళ్లకి కూడా మరి సినిమా దూరం కాకుండా…ఒక బ్యాలెన్స్ గా రేట్లు ఇచ్చారు. ఆ విధంగా ప్రభుత్వం మేలు చేయడానికి సహాయం చేసిన మంత్రివర్యులు పేర్ని నాని మరియు కొడాలి నానికి చాలా థాంక్స్ చెబుతున్నాను అంటూ రాజమౌళి..”RRR” ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు”.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం RRR సినిమా విడుదలైన నాటి నుండి 10 రోజుల పాటు టికెట్ ధరలు పంచుకునే అవకాశం నూట మాత్రమే ఐదు షోలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు 300 కోట్లకు పైగా…RRR బడ్జెట్ తెరకెక్కింది. మార్చి 25 వ తారీకు విడుదల కానున్న ఈ సినిమా దేశ విదేశాలలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విధంగా సినిమా పాటలు నిర్ణయం తీసుకోవడం వెనక చిరంజీవి ఎంతో కృషి చేశారు అని రాజమౌళి కొనియాడారు.