తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ దర్శకధీరుడు ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న చిత్రం `RRRR`(వర్కింగ్ టైటిల్). రూ.350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. తెలంగాణ పోరాట వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. ఇద్దరి పోరాట వీరులకు సంబంధించిన కల్పితగాథ. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో చిత్రీకరించిన సినిమా రషెష్ను రీసెంట్గా రాజమౌళి చూశాడట. ఆయన కొన్ని సీన్స్ టేకింగ్ పట్ల సంతృప్తిగా లేడట. అందుకని సినిమాను రీషూట్ చేయాలనుకుంటున్నాడని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post
next post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!