RRR: మరికొద్ది గంటల్లో “RRR” సినిమా రిలీజ్ కానుంది. ఎన్నో సంవత్సరాల నుండి ఈ సినిమా కోసం దేశ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం చూస్తే “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవడం. వాస్తవానికి ఈ సినిమా 2020 లో రిలీజ్ కావాల్సిన పరిస్థితి. కానీ మహామారి కరోనా వైరస్ రాకతో మొత్తం లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇదిలా ఉంటే అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు మార్చి 25 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్స్ లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఉత్కంఠ భరితంగా మారింది. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు రాజమౌళి తన సినిమాల అన్నిటికంటే ఎక్కువగా ఈ సినిమాకి చేశారు.
దేశంలో ఏఏ రాష్ట్రాలలో రిలీజ్ అవుతుందో… ఆయా రాష్ట్రాలలో మీడియా సమావేశాలు పెట్టి సినిమా గురించి అనేక విశేషాలు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో రీసెంట్ ఇంటర్వ్యూలో రాజమౌళి మరో మల్టీ స్టారర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం “RRR” లో చరణ్, ఎన్టీఆర్ నటించడంతో సౌత్ ఇండియాలో అతిపెద్ద మల్టీస్టారర్ గా నిలిచింది. అయితే మరో మల్టీ స్టారర్ చేయాలని ఛాన్స్ వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని ఇటీవల ఓ ప్రముఖ డైరెక్టర్ యాంకర్ గా రాజమౌళి నీ ప్రశ్నించారు.
దానికి జక్కన్న సమాధానమిస్తూ.. అవకాశం ఇస్తే రజినీకాంత్, కమలహాసన్ లతో మల్టీ స్టారర్ సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో రజనీకాంత్.., హీరో పాత్రలో కమల్ హాసన్ … లేకపోతే విలన్ గా కమల్ హీరోగా రజిని అయినా చేయగలను అటువంటి ఐడియాలు కూడా నాకు ఉన్నాయి.. అంటూ రాజమౌళి తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే దేశంలోనే ఇది అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమా అవుతుందని తాజా వార్త పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!