RRR: “బాహుబలి 2″తో సినిమా ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేశాడు దర్షకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ సినిమాతో భారతదేశ చలనచిత్ర రంగం యొక్క స్థాయి కూడా పెంచాడు. దేశవ్యాప్తంగా “బాహుబలి 2” అనేక రికార్డులు క్రియేట్ చేయటం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి చేసిన “RRR” కూడా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. బాహుబలి వంటి అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” దాదాపు ఆ తరహాలోనే విజయం సాధించింది.
పైగా ఫస్ట్ టైం చరణ్, తారక్ ఇద్దరు కలిసి చేయడంతో … రేర్ కాంబినేషన్ కావడంతో… దక్షిణాదిలో ఈ సినిమా అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా పేరు సంపాదించింది. ఆ తరహా లోనే విజయం సాధించింది. చరణ్ మరియు తారక్ పెర్ఫార్మెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లను సైతం ఎంతగానో ఆకర్షించింది. ఇటీవల జపాన్ దేశంలో విడుదల చేయగా అక్కడ కూడా భారీగా కలెక్షన్స్ సాధించడం జరిగింది. అంతేకాదు ఆస్కార్ అవార్డ్స్ కి కూడా సెలెక్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో రాజమౌళి “RRR 2” గురించి అమెరికాలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ “RRR 2” స్టోరీ పై డిస్కషన్ జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి తన తండ్రి విజయేంద్రప్రసాద్ సినిమా కథ రాసే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తాజా వార్తతో తారక్ మరియు మెగా ఫ్యాన్స్… సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబుతో చేసే సినిమా కంప్లీట్ అయ్యాక “RRR 2” సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.