రజినీకాంత్, కమల్ హాసన్.. ఇద్దరూ తమిళ సూపర్ స్టార్స్ గా దశాబ్దాలుగా కోలీవుడ్ ని ఏలుతున్న వారే. పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య పోటీ కూడా ఉండేదిన. ప్రస్తుతం రాజకీయంగా వారి దారులు వేరైనా సినిమాపరంగా వారిద్దరూ మంచి స్నేహితులు. ఆమధ్య వీరిద్దరూ కలసి ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయిత. మళ్లీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని కూడా వార్తలు వచ్చాయి.
అయితే కోలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవలేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక.. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీతో ఖైదీ తీసి హిట్ కొట్టిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించనున్నారు.
మొదట్లో ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ రజినీ మాత్రమే హీరోగా నటించనున్నారు. రజినీ ప్రస్తుతం అన్నాతే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. లోకేశ్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ తెరకెక్కించారు. కోవిడ్ వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. అన్నీ కుదిరితే లోకేశ్ తర్వాతి ప్రాజెక్టు రజినీకాంత్ తోనే అంటున్నారు. ఈ వార్తలపై మరింత క్లారిఫికేషన్ రావాల్సి ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!