తమిళ తలైవా, సూపర్ స్టార్ రజినికాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చి తమిళ రాజకీయాలను మరింత వేడెక్కేలా చేశారు. దీనిపై ఈనెలాఖరులో పూర్తి వివరాలు తెలియజేస్తానని రజిని తెలపడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు. కళానిధి మారన్ నిర్మాణంలో శివ దర్శకత్వంలో నటిస్తున్న అన్నత్తే సినిమా పూర్తి చేసి రాజకీయాల్లోకి అడుగు పెడదామనే యోచనలో రజిని ఉన్నట్టు తెలుస్తుంది.
లాక్ డౌన్ ముందే చాల భాగం చిత్రీకరణ పూర్తి కాగా కొన్ని ముఖ్య పాత్రల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈనెల 14న హైదరాబాద్కు రానున్నట్టు, మొత్తం 45 రోజులు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ షెడ్యూల్ను చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ సినిమాలో రజిని సరసన నయనతార, కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరితో పాటు ఖుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తలైవకు సంబందించిన చిత్రీకరణ మొదట ఫినిష్ చేసి తరువాత మిగతా ముఖ్య తారాగణంపై షూటింగ్ చేయనున్నారు చిత్రం బృందం.
దీంతో ఈనెల 14 న ఓ ప్రత్యేక విమానంలో రజిని కాంత్ వచ్చి ఒక ప్రముఖ హోటల్లో బస చేసే అవకాశం ఉంది. రజినికి 69 ఏళ్ళు వచ్చిన క్రమంలో అతని ఆరోగ్య రీత్యా ఒక వైద్యున్ని కూడా షూటింగ్ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఒక ఇది ఇలా ఉండగా సినీ విశ్లేషకులు మాత్రం రజిని కాంత్ రాజకీయాల్లో క్లిక్ అయితే హైదరాబాద్లో తీసే సినిమానే ఈ తమిళ తలైవా చివరి చిత్రం అవుతుందని చర్చిస్తున్నారు. ఇదే కనుక నిజం అయితే బస్సు కండక్టర్గా జీవితం ప్రారంభించిన రజిని ఆ తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ సూపర్ స్టార్ చివరి సినిమాగా అన్నెత్తే మిగిలిపోతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!