Rakul: ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ అందాల భామ.. మోడల్గా కెరిర్ స్టార్ట్ చేసి మిస్ ఇండియాగా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకున్న రకుల్.. ఇంటర్ అయ్యాక పాకెట్మనీ కోసం ఓ కన్నడ సినిమాలో నటించింది. అదే `గిల్లి`.
ఆ తర్వాత వరుస ఆఫర్లు రావడంతో రకుల్ సినీ ఇండస్ట్రీని వీడలేకపోయింది. ఈ క్రమంలోనే `కెరటం` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. తనదైన టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. టాలీవుడ్లో నేటితరం హీరోలతో పాటు సీనియర్ స్టార్ హీరోల సరసనా నటించిన రకుల్.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా సినీ కెరీర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆమె.. తన తొలి సంపాదనను ఏం చేసిందో కూడా వివరించింది. `సినిమాల్లో నటిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. పాకెట్ మనీకోసం మొదటి సినిమాకు ఒప్పుకొన్నా. ఆ తర్వాత నా భవిష్యత్తును ఇందులోనే వెతుక్కున్నా. ఇదే మంచి ఎంపిక అనిపించింది. నా మొదటి సంపాదనతో కారును కొనుగోలు చేశారు. కారుకు యజమాని కావడం నిజంగా గొప్ప అనుభూతి` అంటూ చెప్పుకొచ్చింది.
కాగా, రకుల్ ప్రస్తుతం తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో `మిషన్ సిండెరెల్లా`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `ఛత్రివాటి` అనే బాలీవుడ్ సినిమాలతో పాటు `అయలాన్` అనే తమిళ సినిమా కూడా ఉంది. ఇక ఈమె నుంచి చివరిగా వచ్చిన ఎటాక్, రన్వే 34 చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.