రామ్చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరికంతా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసేయబోతున్నారు. దీని తర్వాత చరణ్ ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చరణ్ కథలను వింటున్నారు. రీసెంట్గా దర్శకుడు వంశీ పైడిపల్లి చరణ్ను కలిసి బేసిక్ పాయింట్ను చెప్పారట. చరణ్కు నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి వినిపించమన్నారని టాక్. ప్రస్తుతం `మహర్షి` పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు వంశీ పైడిపల్లి. మే 9న సినిమా విడుదలవుతుంది. దాని తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని చరణ్ స్క్రిప్ట్పై వర్క్ చేస్తారట. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు ముందు రామ్చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ‘ఎవడు’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
previous post
next post