Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాజమౌళితో “RRR” చేస్తూనే మరో పక్క కొరటాల “ఆచార్య” చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు టాప్ డైరెక్టర్లు తెరకెక్కిస్తే ఉండటంతో మెగా అభిమానులకు డబల్ డోస్ చరణ్ నుండి అందనుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా కొరటాల శివ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ తరహాలో అరగంట పాటు సినిమాలో చరణ్ వుంటారని మొదటి నుండి వార్తలు రావడం మనం విన్నాం. కానీ ఇటీవల కొరటాల శివ ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఆచార్య” చరణ్ పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి సినిమాకి మెయిన్ పిల్లర్ చరణ్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు. సెకండాఫ్లో వచ్చినా గానీ ఆయన కథ చిరంజీవి కంప్లీట్ చేస్తారు, ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో చరణ్ చనిపోతాడు అన్న తరహాలో కొరటాల శివ మాటలు ఉన్నాయి. ఏదో అతిథి పాత్రలో వచ్చి వెళ్లిపోయే విధంగా మాత్రం చరణ్ క్యారెక్టర్ రెండో సినిమా మొత్తం ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటది అని చెప్పుకొచ్చారు. ఆయన చనిపోవడం సినిమా వేరే లెవెల్ లో ఉంటది అన్న తరహాలో శివ క్లారిటీ ఇచ్చారు.
Read More: Koratala siva : కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబో అందుకే ఫిక్సైయింది..!
చరణ్ సెకండాఫ్ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తంమీద చూసుకుంటే .. ఇంటర్వెల్ దగ్గర భారీ ఫైట్ ఉంటుందని .. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సెకండాఫ్లో ఉంటుందని కొరటాల శివ కామెంట్లు బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా అయిన వెంటనే కొరటాల శివ.. ఎన్టీఆర్ తో స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటివరకు కొరటాల తెరకెక్కించిన సినిమాలు.. ఏవీ కూడా బాక్స్ ఆఫీసు దగ్గర పరాజయం కాలేదు కావటంతో ఆచార్య సినిమా పై మెగా అభిమానుల అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.