యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వం వహించడం ఈ సినిమాకు జాతీయస్థాయి క్రేజ్ తీసుకొచ్చిందనే విషయం తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా జరుపుకున్న షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.
సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న అలియాభట్ ఇటివలే హైదరాబాద్ వచ్చి షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే.. రామ్ చరణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనలేదు. ఆమె పార్ట్ కొంత షూటింగ్ పూర్తయ్యాక ఆమె తిరిగి ముంబై వెళ్లిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ – అలియా భట్ పాల్గొనే సన్నివేశాలు షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిపై ఈనెల 18 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరో 25 రోజుల షూటింగ్ చేస్తే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. ఈమేరకు టీమ్ అన్ని ఏర్పాట్లు చేసిందని అంటున్నారు. దీనిపై పూర్తి అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.
ఇటివలే రామ్ చరణ్ కూడా చెల్లెలె నిహారిక పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. అలియా భట్ కూడా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో గోవా ట్రిప్ వెళ్లొచ్చింది. వారిద్దరి ట్రిప్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి కూడా. దీంతో వీరిద్దరూ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్ కోసం రెడీగా ఉన్నారని అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాక సినిమా రిలీజ్ డిటైల్స్ రివీల్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం చరణ్–అలియా షూటింగ్ పార్ట్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా వెయిటింగ్.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!