THAMAN : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో మొదటి వరుసలో ఉండే వారిలో తమన్ కూడా ఒకరు. గత ఏడాది తమన్ మ్యూజిక్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమా పాటలు ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమేకాక సౌత్ ఇండియా ని షేక్ చేసి పడేసాయి. “అలా వైకుంఠపురంలో” సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించాయి. ఒక విధంగా సినిమా రిలీజ్ అవ్వకముందే మ్యూజికల్ పరంగా .. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
అందువల్లే ప్రీ రిలీజ్ వేడుకకు కూడా పాటల పరంగా ప్రాధాన్యత ఇస్తూ ఆ సినిమా నిర్మాతలు అప్పట్లో ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ఇండస్ట్రీలో కీలక ప్రాజెక్టులు అందుకుంటున్నారు తమన్. సూపర్ స్టార్ మహేష్ బాబు గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నా “సర్కారు వారి పాట” సినిమా ఛాన్స్ అందుకున్న తమన్.. అంతకుముందే పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా ఛాన్స్ అందుకోవడం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా సౌత్ లో అతిపెద్ద కీలక ప్రాజెక్టుగా స్టార్ట్ అవ్వక ముందే పేరు సంపాదించిన.. శంకర్ – రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుకు తానే మ్యూజిక్ డైరెక్టర్ అని ఇటీవల వకీల్ సాబ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్ స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే కొన్ని బాణీలు కూడా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకే ఒక్కడు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది. సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు ఫిలింనగర్ లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో .. రామ్ చరణ్ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని కన్ఫామ్ కావటంతో మెగా ఫ్యాన్స్ .. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.