Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ ఇండియా సెన్సేషనల్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి… నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో…చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా కమెడియన్ సునీల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో .. జరగగా ఇప్పుడు తాజాగా.. నెక్స్ట్ షెడ్యూల్ నీ చరణ్ తనకి అచ్చు వచ్చిన.. ప్రాంతంలో ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. ఆ ప్రాంతం మరేదో కాదు రాజమండ్రి. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన “రంగస్థలం” సినిమా.. షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరిగింది. ఈ క్రమంలో శంకర్ సినిమాలో కీలకమైన సన్నివేశాలను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని చరణ్ పట్టుబట్టినట్లు..ప్రొడ్యూసర్ దిల్ రాజు…ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 8వ తారీఖు నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
శంకర్ కూడా తన సినిమాలు భారతీయుడు ఇంకా ఒకే ఒక్కడు వంటి వాటిలో కీలకమైన సన్నివేశాలను… రాజమండ్రిలోనే చిత్రీకరించినట్లు దీంతో డైరెక్టర్ అదేవిధంగా హీరోకి కలిసొచ్చిన ప్రాంతంగా రాజమండ్రి ఉండటంతో… ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన ఈ ప్లాన్ షెడ్యూల్… సినిమా యూనిట్ రెడీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని వార్తలు వస్తున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో సినిమా స్క్రిప్ట్… చెర్రీ కోసం.. శంకర్ రాసినట్లు.. చాలా త్వరగానే కంప్లీట్ చేయాలి అని.. సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు సమాచారం.