Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన వెంటనే.. చరణ్ తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో స్టార్ట్ చేశాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే వరుస సినిమాలతో మస్తు బిజీగా గడుపుతున్న చరణ్.. తాజాగా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని భార్య ఉపాసనతో కలిసి వెకేషన్కు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే చరణ్తో దిగిన ఓ పిక్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఉపాసన.. రెండేళ్ల తర్వాత వెకేషన్, థాంక్ యూ మిస్టర్ సి అంటూ రాసుకొచ్చింది.
మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత చరణ్ వెకేషన్కి తీసుకెళ్లడంతో.. ఉపాసన ఫుల్ ఫిదా అయినట్లు ఆమె మాటల బట్టే తెలుస్తోంది. కాగా, ఈ వెకేషన్ అనంతరం చరణ్ `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్లో బిజీగా మారనున్నాడు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!