ప్రస్తుతం రామ్ చరణ్ .. సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సన్నివేశం విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గౌతం తిననూరి దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే పవన్ రీయంట్రి మూవీ “వకీల్ సాబ్” తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాక్. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా చేయనున్నారట. అంతేకాదు ఈ సినిమాని యూవి క్రియేషన్స్ బ్యానర్ లో చరణ్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. పవన్ “వకీల్ సాబ్” సూపర్ డూపర్ హిట్ అయింది. లాయర్ గా పవన్ కళ్యాణ్ ని చాలా పవర్ ఫుల్ పాత్రలో.. దర్శకుడు వేణు శ్రీరామ్ చూపించారు. పొలిటికల్ రంగం నుండి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ఇక చరణ్ తో కూడా చాలా అదిరిపోయే సబ్జెక్టుతో వేణు శ్రీరామ్ సినిమా ప్లాన్ చేసినట్లు టాక్.