Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ ఓస్ట్ పెట్టి తల్లికి సర్ప్రైజ్ ఇచ్చారు. అమ్మను మించిన దైవమున్నదా అని ఓ సినీ కవి రాసిన పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. సుమన్ హీరోగా వచ్చిన 20వ శతాబ్ధం సినిమాలోని ఈ పాట వింటే ప్రతీ తల్లి – కొడుకు ఎమోషనల్ అవ్వాల్సిందే. అంత గొప్పగా అమ్మ గొప్పతాన్ని చూపించారు. ఈ పాట లిరిక్స్ కూడా అంతే గొప్పగా ఉంటాయి. అలాంటి ఓ ఎమోషనల్ మూవ్మెంట్ను చరణ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి శ్రీమతి సురేఖ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొనే చరణ్ తాజాగా పోస్ట్ పెట్టారు.
చిరు, చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ సినిమా ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో సెట్కు వచ్చిన చరణ్ తల్లి సురేఖతో ఒకవైపు చిరు మరొకవైపు చరణ్ కలిసి ఉన్న ఫొటోను రివీల్ చేశారు. ఈ ఫోటోకు చరణ్ తన తల్లితో ఉన్న అనుభంధాన్ని రాసుకొచ్చారు. చరణ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఫొటోకు..’నీకు తెలిసనంతగా నేను మరెవరికీ తెలయను. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ ఫొటో చూసిన మెగా అభిమానులైతే చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మెగా హీరోలను ఇలా చూడటం కంటే ఇంకేమి కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Ram charan: ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్..!
కాగా, చిరు – చరణ్ల మల్టీస్టారర్ ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటించగా, పూజా హెగ్డే చరణ్ సరసన హీరోయిన్గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తైన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారు. ఇక ఇప్పటికే ఆచార్య సినిమాను ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చరణ్ ఈ సినిమాను తల్లి సురేఖ సమర్పణలో మాట్నీ ఎంటర్టైమెంట్స్ బ్యానర్ వారు నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ భారీగా అంచనాలను పెంచాయి.